బొబ్బిలి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.!

బొబ్బిలి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.!
బొబ్బిలి ఎమ్మెల్యే- బేబీ నాయన కు వినతి..!
బొబ్బిలి నాన్ అక్రిడేషన్ సంఘ అధ్యక్షులు – సునీల్ కుమార్.!
విజయనగరం జిల్లా బొబ్బిలి 07
బొబ్బిలి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే రంగారావు (బేబీ నాయన) కు ఆ సంఘ అధ్యక్షులు కాగాన, సునీల్ కుమార్, ఉపాధ్యక్షులు, అక్కేరేపు, అప్పారావు, కార్యదర్శి, కురమాన, రామకృష్ణ, కోశాధికారి, ఎన్.వి, నాయుడు, సలహాదారులు మురళి లా ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల కమిటీని నూతనంగా ఏర్పాటు చేశామని, జర్నలిస్టుల సమస్యలలో ముఖ్యమైనది బొబ్బిలి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలని వారు కోరారు. జర్నలిస్టులు ప్రజా సేవకై నిరంతరము సమాచారాన్ని వార్తలను సేకరించి, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి బొబ్బిలి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయినా బొబ్బిలిలో ఇంతవరకు “బొబ్బిలి” ప్రెస్ క్లబ్” నిర్మాణానికి, ఎలాంటి, ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గానీ సహకరించలేదని వారు అన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బేబీ నాయన అయినా బొబ్బిలి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల కమిటీ తరఫున “బొబ్బిలి ప్రెస్ క్లబ్” నిర్మాణానికి స్థలాన్ని మంజూరు చేసి నిర్మాణం చేసుకోడానికి సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా వారు కోరారు. అనంతరం బొబ్బిలి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్,
కె, నారాయణరావు ను మరియు బొబ్బిలి తహసిల్దార్ ఎం, శ్రీను, అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఎస్,ఐ, శ్రావణ్ కుమార్, మండల అభివృద్ధి అధికారి రవి కుమార్,ను మర్యాదపూర్వకంగా కలిసి బొబ్బిలిలో నూతనంగా ఏర్పాటు చేసిన బొబ్బిలి నాన్ అక్రిడేషన్”
జర్నలిస్టుల సంఘానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించి మీ ద్వారా ప్రజల కు తెలియజేయవలసిన వార్తా సమాచారాన్ని ఎల్లప్పుడూ వారికి తెలియజేస్తూ ప్రజా సమస్యలను అధికారులకు ప్రజా ప్రతినిధులకు నిరంతరం అందించడంలో తమ వంతు కృషి చేస్తామని ఆ సంఘ అధ్యక్షులు సునీల్ కుమార్, ఉపాధ్యక్షులు అక్కేరేపు, అప్పారావు, కార్యదర్శి, కురమాన, రామకృష్ణ, కోశాధికారి ఎం,వి, నాయుడు, సలహాదారులు మురళి, ఈ సందర్భంగా అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొద్దాన శ్రీనివాసరావు, పొలుబోతు అమర్నాధ్, కోట శ్రీనివాసరావు, బేత సురేష్, రామకృష్ణ,(చంటి) మురళి, మూర్తి, మాస్టారు, పాతిరెడ్డి హరి, విజయ్, సి,హెచ్, శ్రీనివాసరావు, కిషోర్, బొబ్బిలి గణేష్, మహేష్, శ్రీనివాస్, జామి సీతారాం, సతీష్, దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.












